సర్పంచ్ అభ్యర్థి ఆఫర్ హల్ చల్.. ఏకగ్రీవం విఫలం
హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం జయగిరిలో సర్పంచ్ పదవి కోసం స్వతంత్ర అభ్యర్థి న్యాయవాది తాళ్లపల్లి వెంకటేశ్ ఏకగ్రీవం ఇస్తే గ్రామాభివృద్ధికి రూ. 50 లక్షలు ఖర్చు చేస్తానని ప్రకటించడంతో గ్రామంలో కలకలం చెలరేగింది. రచ్చబండ సమావేశంలో ఇతర అభ్యర్థులు ఉపసంహరణకు అంగీకరించినా, అధికార పార్టీ అభ్యర్థి పల్లె దయాకర్ హాజరుకాకపోవడంతో ఉపసంహరణ గడువు ముగిసిపోయింది. ఫలితంగా జయగిరిలో సర్పంచ్ పదవికి పోటీ అనివార్యమైంది.
