మేడారం జాతర బందోబస్త్ కి వచ్చే సిబ్బందికి తగిన వసతులు కల్పించాలి.
జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకాన్, ఐపిఎస్
మేడారం మహా జాతర సందర్భంగా బందోబస్తు కోసం వచ్చేటువంటి అధికారులు మరియు సిబ్బందికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వసతులు ఏర్పాటు చేయాలని ములుగు జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకాన్ ఐపీఎస్ గారు అధికారులను ఆదేశించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు అధికారులతో కలిసి వెంగలాపూర్ నుంచి మొదలుకొని బయ్యక్కపేట వరకు, అదేవిధంగా మేడారంలో వసతుల కోసం నిర్దేశించిన ప్రదేశాలను స్వయంగా సందర్శించి పరిశీలించారు. ఆయా ప్రదేశాలలో చేస్తున్న ఏర్పాట్లపై సమీక్ష చేస్తూ మేడారం మహా జాతర బందోబస్తు కోసం వచ్చేటువంటి అధికారులు మరియు సిబ్బంది కి ఎటువంటి లోటుపాట్లు లేకుండా వసతులు ఏర్పాట్లు చేయాలని, తద్వారా వారు కూడా నిబద్ధతతో విధులు నిర్వహిస్తారని తెలియజేశారు. జాతర ప్రారంభానికి ముందే పనులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
తదనంతరం అధికారులతో కలిసి ప్రస్తుతం మేడారం లో జరుగుతున్న రహదారి పనులను, అలాగే గుడి లో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా ఓఎస్డీ శివం ఉపాధ్యాయ ఐపీఎస్, ములుగు డి.ఎస్.పి రవీందర్, పసర సీఐ దయాకర్, ఆర్ ఐ లు స్వామి, వెంకటనారాయణ, తిరుపతి లు పాల్గొన్నారు.
