వందే భారత్ స్లీపర్ ట్రైన్ ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ..
భారతీయ రైల్వే ముఖచిత్రాన్ని మార్చేసిన ‘వందే భారత్’ ఇప్పుడు మరో కొత్త అవతారంలో మన ముందుకు వచ్చింది. ఇప్పటివరకు కేవలం కూర్చుని ప్రయాణించే (Chair Car) సదుపాయం మాత్రమే ఉండగా.. ఇప్పుడు సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల కోసం వందే భారత్ స్లీపర్ (vande bharat sleeper) రైలును ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఘనంగా ప్రారంభించారు. శనివారం (జనవరి 17, 2026) పశ్చిమ బెంగాల్లోని మాల్డా టౌన్ వేదికగా దేశంలోనే మొట్ట మొదటి స్లీపర్ వందే భారత్ కు ఆయన పచ్చజెండా ఊపారు.
