ACB ఏసీబీ అధికారులను చూసి.. పొలాల్లోకి పరుగెత్తిన ఎస్సై
టేక్మాల్: మెదక్ జిల్లా టేక్మాల్ ఎస్సై రాజేశ్ ఏసీబీ వలకు చిక్కాడు. ఓ కేసు విషయంలో రూ.40వేలు లంచం తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులు ఎంట్రీ ఇచ్చారు. వారిని చూసిన ఎస్సై పొలాల్లోకి పరుగెత్తాడు. దీంతో అతడిని వెంబడించి పట్టుకున్నారు. పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చి విచారిస్తున్నారు. ఎస్సై ఏసీబీ అధికారులకు చిక్కడంతో గ్రామస్థులు.. స్టేషన్ ఎదుట టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు.

టపాసులు కాల్చి సంబరాలు చేసుకుంటున్న గ్రామస్థులు
