ఇజ్రాయిలీ స్టార్టప్లతో తెలంగాణలో పైలట్ ప్రోగ్రామ్స్
Jan 20, 2026,
ఇజ్రాయిలీ స్టార్టప్లతో తెలంగాణలో పైలట్ ప్రోగ్రామ్స్
దావోస్లో పర్యటిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇజ్రాయెల్ ఇన్నొవేషన్ అథారిటీ ఛైర్మన్ అలోన్ స్టోపెల్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, హెల్త్టెక్, అగ్రి-టెక్, సైబర్ సెక్యూరిటీ, ఏరోస్పేస్ వంటి రంగాలలో తెలంగాణకు ఇజ్రాయెల్ సహకారం అందించనున్నట్లు తెలంగాణ సీఎంవో వెల్లడించింది. తెలంగాణ ప్రభుత్వం ఇజ్రాయెలీ స్టార్టప్లతో కలిసి రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్టులను చేపట్టాలని యోచిస్తోంది.
