సర్పంచ్ బరిలో ట్రాన్స్ జెండర్
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం వెంకట్రావ్పల్లి పంచాయతీ సర్పంచి అభ్యర్థిగా అదే గ్రామానికి చెందిన ట్రాన్స్ జెండర్ కుమ్మరి వైశాలి గురువారం నామినేషన్ వేశారు. ఆ పంచాయతీ సర్పంచి స్థానం జనరల్ మహిళకు రిజర్వు అయింది. కాగా వైశాలి గత అసెంబ్లీ ఎన్నికల్లో సైతం చెన్నూర్ స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేసి తర్వాత ఉపసంహరించుకున్నారు. మరి ఈ సారి సర్పంచ్ అభ్యర్థిగా బరిలో ఉంటారా? ఉపసంహరించుకుంటారా? అనేది ఆసక్తిగా మారింది.
