రవీంద్రభారతి ప్రాంగణంలో ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ
హైదరాబాద్: రవీంద్రభారతి ప్రాంగణంలో గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహావిష్కరణ ఘనంగా జరిగింది. ఈకార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, హరియాణా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, మంత్రి శ్రీధర్బాబు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో 7.2 అడుగుల బాలు కాంస్య విగ్రహాన్ని తయారుచేయించారు. ఈ సాయంత్రం రవీంద్రభారతిలో 50 మందితో సంగీత విభావరి ఏర్పాటు చేశారు.
